Kamareddyలో రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-02-21T14:41:26+05:30 IST
జిల్లాలోని భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో కురుమ సిద్ధ రాములు(49) అనే రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కామారెడ్డి: జిల్లాలోని భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో కురుమ సిద్ధ రాములు(49) అనే రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సరిహద్దు పంచాయతీ విషయంలో సిద్దరాములుకు, మరో రైతుకు మధ్య వివాదం జరిగింది. సదరు రైతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సిద్ధరాములు పోలీస్స్టేషన్కు పిలిపించారు. దీంతో మనస్థాపానికి గురైన సిద్ధరాములు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్ధరాములు ఆత్మహత్యకు కారణమైన రైతును అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.