మాజీ మంత్రి కమతం రామిరెడ్డి కన్నుమూత..

ABN , First Publish Date - 2020-12-05T14:38:13+05:30 IST

హైదరాబాద్: తెలంగాణాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కమతం రామిరెడ్డి మృతి చెందారు. రామిరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు

మాజీ మంత్రి కమతం రామిరెడ్డి కన్నుమూత..

హైదరాబాద్: తెలంగాణాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కమతం రామిరెడ్డి మృతి చెందారు. రామిరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డితో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రామిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతగా చాలా కాలం పాటు కొనసాగిన ఆయనకు 2014 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో బిజెపిలో చేరి టీడీపీ, బీజేపీ కూటమి తరపున పోటీ చేశారు. అయితే అప్పుడు ఆయన ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో రామిరెడ్డికి కేవలం 13355 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Updated Date - 2020-12-05T14:38:13+05:30 IST