నీటికుంటలో పడి బాలుడి మృతి
ABN , First Publish Date - 2021-03-03T05:45:09+05:30 IST
ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని కంకణాలపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగింది.
సత్తెనపల్లిరూరల్, మార్చి 2: ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని కంకణాలపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగింది. సేకరించిన సమాచారం మేరకు.. ఎస్సీ కాలనీకి చెందిన మద్దూరి ఏసుబాబు (10) స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. పాఠశాల ముగియగానే ఇంటికి వచ్చి ముగ్గురు స్నేహితులతో కలిసి కాలనీ సమీపంలోని నీటి కుంటల ప్రాతంలో ఆడుకునేందుకు వెళ్ళాడు. ఈక్రమంలో కాలుజారి నీటికుంటలో పడ్డాడు. తోటి పిల్లలు పెద్దగా కేకలు వేయటంతో పొలాల్లో పనిచేస్తున్న కూలీలు హుటాహుటిన అక్కడికి వెళ్ళి చూడగా బాలుడు నీటిపై తేలాడుతూ కనిపించాడు. బయటకు తీసి పరీక్షించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మాణిక్యరావు, ఏసురాణి, బంధువులు బాలుని మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు.