కరోనాతో యూపీ మంత్రి కమలా వరుణ్ కన్నుమూత
ABN , First Publish Date - 2020-08-02T16:44:34+05:30 IST
మంత్రి కమలా వరుణ్ (62) కరోనాతో ఆదివారం ఉదయం మృతి చెందారు. యోగి ఆదిత్యనాథ్
లక్నో : మంత్రి కమలా వరుణ్ (62) కరోనాతో ఆదివారం ఉదయం మృతి చెందారు. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో ఆమె సాంకేతిక విద్యా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ లక్షణాలు వెలుగుచూడటంతో ఆమె జూలై 18 న ఓ ఆస్పత్రిలో చేరారు. ‘‘ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరగడంతో ఒక్కసారిగా పరిస్థితి క్షీణించింది. వెంటిలేటర్లపై చికిత్స అందించాం. మా వైద్యులు ఆమెను కాపాడేందుకు శతధా ప్రయత్నించారు. కానీ... ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు’’ అని ఆస్పత్రి డైరెక్టర్ రాధా కృష్ణ వెల్లడించారు.