కనక మహాలక్ష్మిపై ధన వర్షం
ABN , First Publish Date - 2021-01-21T05:28:21+05:30 IST
పాత విశాఖ నగరంలోని ఉత్తరాంధ్రుల భక్తదాయని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం హుండీలను బుధవారం లెక్కించారు.
హుండీ ఆదాయం రూ.42.16 లక్షలు
95 గ్రాముల బంగారం, కేజీ వెండి లభ్యం
వన్టౌన్, జనవరి 20: పాత విశాఖ నగరంలోని ఉత్తరాంధ్రుల భక్తదాయని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం హుండీలను బుధవారం లెక్కించారు. మొత్తం 21 రోజులకుగాను 42 లక్షల 16 వేల రూపాయలు నగదు, 95 గ్రాముల బంగారంతోపాటు కేజీ వెండి భక్తులు కానుకలుగా సమర్పించారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.జ్యోతిమాధవి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉద్యోగులు, ఆధ్యాత్మిక సంస్థల వలంటీర్లు పాల్గొన్నారు.