డ్రగ్స్ రవాణా విషయంలో కాకినాడ ఎమ్మెల్యేను విచారించాలి: కనకమేడల

ABN , First Publish Date - 2021-09-29T19:22:20+05:30 IST

రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి పట్టిపడిస్తున్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర విమర్శించారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా ఏపీ మూలంగా మారిందన్నారు.

డ్రగ్స్ రవాణా విషయంలో కాకినాడ ఎమ్మెల్యేను విచారించాలి: కనకమేడల

అమరావతి: రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి పట్టిపడిస్తున్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర విమర్శించారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా ఏపీ మూలంగా మారిందన్నారు. రాష్ట్రం నుంచి ఢిల్లీకి తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆషి ట్రేడింగ్ కంపెనీపైన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కనకమేడల పేర్కొన్నారు. మహ్మద్ అలిషా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. డ్రగ్స్ రవాణాకు కాకినాడ పోర్టు కేంద్రంగా మారిందనే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మహ్మద్ ఆలిషాకు వైసీపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. డ్రగ్స్ రవాణా విషయంలో వైసీపీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయంపై కూడా విచారణ చెయ్యాలని కనకమేడల డిమాండ్ చేశారు.

Updated Date - 2021-09-29T19:22:20+05:30 IST