ఏజీ వాదనలో పస లేదు: కనకమేడల

ABN , First Publish Date - 2020-06-01T09:21:17+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహారంలో అడ్వొకేట్‌ జనరల్‌ చేస్తున్న వాదనలో పస లేదని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ..

ఏజీ వాదనలో పస లేదు: కనకమేడల

విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహారంలో అడ్వొకేట్‌ జనరల్‌ చేస్తున్న వాదనలో పస లేదని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ వ్యాఖ్యానించారు. న్యాయ సలహాదారుగా ఉన్న ఏజీ కోర్టు తీర్పును వక్రీకరించడం తగదన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ చెల్లదని హైకోర్టు చెప్పాక.. ఆ తీర్పు సరిగా లేదనడం సరికాదన్నారు. హైకోర్టు తీర్పుపై ఏజీ శ్రీరాం మీడియా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవచ్చని, అంతకుమించి చేస్తే కోర్టుతీర్పుల ఉల్లంఘనే అవుతుందన్నారు.  

Updated Date - 2020-06-01T09:21:17+05:30 IST