పాస్పోర్టు రెన్యువల్ కోసం హైకోర్టుకు కంగన
ABN , First Publish Date - 2021-06-15T05:29:05+05:30 IST
పాస్పోర్టు రెన్యువల్ కోసం హైకోర్టుకు కంగన
ముంబై: తన పాస్పోర్టు రెన్యువల్ చేసేలా రీజనల్ పాస్పోర్టు అథారిటీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇవాళ బోంబే హైకోర్టును ఆశ్రయించారు. దేశద్రోహం అభియోగాలతో తనపై బంద్రా పోలీసులు కేసు నమోదు చేయడం, ట్విటర్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పాస్పోర్టు రెన్యువల్ చేసేందుకు ముంబైలోని స్థానిక పాస్పోర్టు అథారిటీ నిరాకరించినట్టు ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. కంగన తరపున న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖి ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తన తర్వాతి సినిమా ‘‘థక్కడ్’’లో నటించేందుకు ఈ నెలలో బుడాపెస్ట్, హంగేరీకి వెళ్లాల్సివున్నందున తన పాస్పోర్టు వెంటనే పునరుద్ధరించాలని ఆమె ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.