మోదీ నిర్ణయాలు ప్రపంచానికి ఆదర్శం: కన్నా
ABN , First Publish Date - 2020-06-01T08:37:20+05:30 IST
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు.
విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు. ట్రిపుల్ తలాక్, అయోధ్య, కశ్మీర్ వంటి అంశాలపై ఆయన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఆదివారం విజయవాడలో కన్నా మీడియాతో మాట్లాడారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.1.75 లక్షల కోట్లు పేదలకు పంపిణీ చేశారన్నారు. కానీ ఈ నగదును జగన్ తాను ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారని కన్నా తప్పుబట్టారు. రెండో విడతలో ప్రపంచంలో ఎక్కడా లేనివిఽధంగా రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారని కొనియాడారు.