డబుల్ గేమ్ ఆడే సిద్ధాంతం బీజేపీకి లేదు: కన్నా లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2021-02-27T19:21:11+05:30 IST

డబుల్ గేమ్ ఆడే సిద్దాంతం బీజేపీకి లేదని బీజేపీ సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

డబుల్ గేమ్ ఆడే సిద్ధాంతం బీజేపీకి లేదు: కన్నా లక్ష్మీనారాయణ

ప్రకాశం: డబుల్ గేమ్ ఆడే సిద్ధాంతం బీజేపీకి లేదని బీజేపీ సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి హక్కుల కోసం పోరాడింది బీజేపీ ఒక్కటేనని తెలిపారు. ప్రభుత్వం వ్యాపారం చేయడం కాదు... ప్రజలకు ఏది అవసరమో అది చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అరాచకం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసేందుకు వైసీపీ భయపడుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికీ రేట్లు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజీల్‌పై యూపీఎ ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీ అమలులో ఉందన్నారు. పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు వ్యాట్ వేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-27T19:21:11+05:30 IST