మేము ప్రజలకు చెబుతాం..ప్రజలకే జవాబుదారీగా ఉంటాం: కన్నబాబు

ABN , First Publish Date - 2020-09-24T21:24:24+05:30 IST

మేము ప్రజలకు చెబుతాం..ప్రజలకే జవాబుదారీగా ఉంటాం: కన్నబాబు

మేము ప్రజలకు చెబుతాం..ప్రజలకే జవాబుదారీగా ఉంటాం: కన్నబాబు

అమరావతి: రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగితే చంద్రబాబు మహాదానందం పొందుతున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. రథం దగ్ధమైతే చంద్రబాబు ఆనంద తాండవం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తి శ్రద్ధలతో జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు గతంలో కులాలను..ఇప్పుడు మతాన్ని అడ్డంపెట్టి రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణ పేరుతో చంద్రబాబు ఎన్నో ఆలయాలను కూల్చివేయించారని చెప్పారు. జగన్ ఢిల్లీ టూర్‌పై టీడీపీ అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాము ప్రజలకు చెబుతాం..ప్రజలకే జవాబుదారీగా ఉంటామన్నారు. తానింకా ప్రభుత్వాన్ని నడుపుతున్నానని చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు.

Updated Date - 2020-09-24T21:24:24+05:30 IST