‘పొటాష్’ అవసరమెంతో కన్నబాబుకేం తెలుసు?: మర్రెడ్డి
ABN , First Publish Date - 2021-10-15T06:54:21+05:30 IST
ఊడిపోయే మంత్రి పదవిని కాపాడుకోవటానికే కురసాల కన్నబాబు తనకు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడి
ఊడిపోయే మంత్రి పదవిని కాపాడుకోవటానికే కురసాల కన్నబాబు తనకు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడి, తన పరువు తానే తీసుకుంటున్నారని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి బేసిన్లో 22 లక్షల ఎకరాల్లో వరిపంట పొట్ట దశలో ఉండగా, అన్నదాతలకు తక్షణం 2,500 మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరం ఉందని, పొటాష్ ఎంతుందో, ఎంత ఇండెంట్ పెట్టారో, ఎంతనిల్వ ఉందో వ్యవసాయశాఖమంత్రిగా కన్నబాబుకు తెలుసా? అన్నారు.