ట్రంప్ కోసం రెడీ అవుతున్న కాన్పూర్ స్వీట్లు
ABN , First Publish Date - 2020-02-22T22:30:30+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం బీజేపీ కార్యకర్తలు ఓ ప్రత్యేక గిఫ్ట్ రెడీ చేస్తున్నారు. ఆయనకు బహుమానంగా అందజేసేందుకు కాన్పూర్ ప్రత్యేక, సంప్రదాయ ..
కాన్పూరు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం బీజేపీ కార్యకర్తలు ఓ ప్రత్యేక గిఫ్ట్ రెడీ చేస్తున్నారు. ఆయనకు బహుమానంగా అందజేసేందుకు కాన్పూర్ ప్రత్యేక, సంప్రదాయ మిఠాయిలకు (స్వీట్లు) ఆర్డర్ చేశారు. కాన్పూర్ రైల్ బజార్లో మంచి పేరున్న శాంతి స్వీట్ హౌస్కు ఈ ఆర్డర్ ఇచ్చారు. ఈనెల 24న అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో ట్రంప్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగానే ఈ గిఫ్ట్ అందజేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడి కోసం కాన్పూర్ ప్రత్యేక స్వీట్లు తయారు చేసేందుకు తనకు ఆర్డర్ రావడం చాలా గర్వంగా ఉందని శాంతి స్వీట్ హౌస్ యజమాని అజయ్ గుప్తా తెలిపారు. కాన్పూర్ తీపిదనాన్ని స్వీట్లలో రంగరించి వాటిని ప్రత్యేకంగా తయారు చేస్తున్నామని, స్వీటు బాక్సులపై 'నమస్తే ట్రంప్' నినాదాలను కూడా ముద్రిస్తామని చెప్పారు. కాగా, మొతేరా స్టేడియంకు వెళ్లి డోనాల్స్ ట్రంప్కు నేరుగా స్వీట్లు అందజేసేందుకు ప్రయత్నిస్తామని స్థానిక బీజేపీ నేత జ్ఞానేష్ మిశ్రా తెలిపారు.