Kanpur Test: అరంగేట్రంలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ
ABN , First Publish Date - 2021-11-26T16:01:02+05:30 IST
టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. అరంగేట్రం టెస్టులోనే శ్రేయస్ అయ్యార్ శతకం సాధించాడు. తనదైన స్టైల్లో 157 బంతుల్లో...
కాన్పూర్: టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. 4 వికెట్ల నష్టానికి 258 పరుగులతో ఆటను టీమిండియా ప్రారంభించింది. క్రీజులో పాతుకుపోయిన శ్రేయస్ అయ్యర్..అరంగేట్రం టెస్టులోనే శతకం సాధించాడు. తనదైన స్టైల్లో 157 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 91.1 ఓవర్లో సౌథీ బౌలింగ్లో రెండు రన్స్ తీసి తొలి టెస్టులో తన సత్తాను చాటి చూపించాడు. అరంగ్రేటం రోజే శ్రేయస్ అయ్యర్ క్లాసిక్ షాట్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం టీమిండియా 94 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ 104, అశ్విన్ 4 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.
ప్రారంభమైన కొద్దీసేపటికే టీమిండియాకు షాక్ తగిలింది. భారత్ 266 రన్స్ వద్ద ఐదో వికెట్ను చేజార్చుకుంది. సౌథీ బౌలింగ్లో జడేజా (112 బంతుల్లో 4 ఫోర్లతో 50) పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్దీమాన్ సాహా ఒక్క పరుగు మాత్రమే చేసి కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.