కాంగ్రెస్.. కళ్లకు గంతలు కట్టుకొని ముందుకు సాగుతూనే ఉంటుంది: కపిల్ సిబల్
ABN , First Publish Date - 2021-08-17T09:11:28+05:30 IST
పార్టీలో ఏం జరిగినా కాంగ్రెస్ మాత్రం కళ్లకు గం తలు కట్టుకొని ముందుకు సాగిపోతూనే ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ..
న్యూఢిల్లీ, ఆగస్టు 16: పార్టీలో ఏం జరిగినా కాంగ్రెస్ మాత్రం కళ్లకు గం తలు కట్టుకొని ముందుకు సాగిపోతూనే ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ మరోసారి పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మాజీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ సుష్మితాదేవ్ సోమవారం కాంగ్రె్సను వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాసేవలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపిన రాజీనామా లేఖలో సుష్మిత పేర్కొన్నారు. ఆమె రాజీనామాతో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పార్టీపై మరోసారి ట్విటర్లో విరుచుకుపడ్డారు. ‘‘సుష్మితాదేవ్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇలా యువనేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతుంటే, పార్టీ బలోపేతానికి మేం ఏమీ చేయలేదని, మా లాంటి వృద్ధులను నిందిస్తున్నారు’’ అని విమర్శించారు.