‘ఆత్మవిశ్వాసానికి కరాటే పోటీలు దోహదం’
ABN , First Publish Date - 2021-04-14T05:20:08+05:30 IST
ఆత్మవిశ్వాసానికి, ధృడచిత్తానికి, మనోబలా నికి స్క్యై కరాటే పోటీలు దోహదపడతాయని నగర పాలక సంస్థ మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు.
ఏలూరు స్పోర్ట్స్, ఏప్రిల్ 13:ఆత్మవిశ్వాసానికి, ధృడచిత్తానికి, మనోబలా నికి స్క్యై కరాటే పోటీలు దోహదపడతాయని నగర పాలక సంస్థ మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఇటీవల నెల్లూరులో స్క్యై చాంపి యన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి క్రీడాకా రులు పాల్గొన్నారు. జిల్లా నుంచి కోచ్ ఎం.డి. ఖాజీ శిష్య బృందం 20 మంది పాల్గొన్నారు. వీరంతా ప్రతిభ కనబర్చి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. పతక విజేతలు మంగళవారం నూర్జహాన్ దంపతు లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కార్యక్రమంలో స్క్యై జిల్లా అధ్యక్షుడు రియాజ్ అలీఖాన్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.