సోషల్ మీడియాపై దృష్టి సారించాం

ABN , First Publish Date - 2021-08-01T03:09:00+05:30 IST

ఉప ఎన్నిక నేపథ్యంలో సోషల్ మీడియాపై దృష్టి సారించామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ

సోషల్ మీడియాపై దృష్టి సారించాం

హుజురాబాద్: ఉప ఎన్నిక నేపథ్యంలో సోషల్ మీడియాపై దృష్టి సారించామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ అన్నారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో సీపీ సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికల విషయంలో ప్రజలు అభద్రతా భావానికి గురికావద్దన్నారు. శాంతి భద్రతలు ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సోషల్ మీడియాపై దృష్టి సారించామన్నారు. సోషల్ మీడియాను ఒక్కోసారి నమ్మలేని పరిస్థితి ఉందన్నారు. అప్రమత్తతో ఉన్నామని సీపీ సత్యనారాయణ తెలిపారు. 

Updated Date - 2021-08-01T03:09:00+05:30 IST