ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-07-23T17:06:04+05:30 IST
ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్పై కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కరీంనగర్ జిల్లా: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్పై కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరాధ్య దైవంగా పూజించే హిందు దేవతలను ఆవమానించే రీతిలో విద్వేషపూరితంగా ప్రతిజ్ఞ చేశారంటూ.. న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్పై 144/2021, సెక్షన్లు 153-ఏ, 295-ఏ, 298 r/w 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.