సౌదీలో కరోనా కాటుకు తెలంగాణ వాసి మృతి!

ABN , First Publish Date - 2020-09-28T16:01:08+05:30 IST

సౌదీ అరేబియాలో కరోనా కాటుకు.. తెలంగాణ వాసి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని కరీంనగర్‌కు

సౌదీలో కరోనా కాటుకు తెలంగాణ వాసి మృతి!

రియాద్: సౌదీ అరేబియాలో కరోనా కాటుకు.. తెలంగాణ వాసి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన మహమ్మద్ రఫీ అలియాస్ రిజ్వాన్ (54).. కొన్ని సంవతర్సరాల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. గత 20 సంవత్సరాలుగా.. అక్కడున్న ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మూడు వారాల క్రితం ఆయన.. కొవిడ్-19 బారినపడ్డారు. దీంతో స్నేహితులు అతడ్ని.. ఆస్పత్రిలో చేర్పించారు. వెంటీలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించడం వల్ల మహమ్మద్ రఫీ ఆరోగ్యం మెరుగుపడింది. అయితే ఉన్నట్టుండి.. అతని ఆరోగ్యం క్షీణించింది. మెదడు సంబంధిత సమస్యలతో శుక్రవారం.. ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. శనివారం రోజు అంత్యక్రియలు ముగిసాయని అతని స్నేహితులు వెల్లడించారు. 


Updated Date - 2020-09-28T16:01:08+05:30 IST