Karimnagarలో యువతి దారుణ హత్య
ABN , First Publish Date - 2022-01-08T16:27:56+05:30 IST
జిల్లాలోని మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామ శివార్లలోని గుట్టలో యువతి వరలక్ష్మి (19) దారుణ హత్యకు గురైంది.
కరీంనగర్: జిల్లాలోని మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామ శివార్లలోని గుట్టలో యువతి వరలక్ష్మి (19) దారుణ హత్యకు గురైంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. వరలక్ష్మి కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు తిమ్మాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో యువతిని ప్రియుడు అఖిల్(22) హత్య చేసినట్లు బయటపడింది. కుళ్ళిన స్థితిలో వరలక్ష్మి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.