Karimnagarలో సెల్ఫీ సూసైడ్ కలకలం
ABN , First Publish Date - 2022-01-20T17:48:50+05:30 IST
జిల్లాలోని తిరుమలనగర్లో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపుతోంది.
కరీంనగర్: జిల్లాలోని తిరుమలనగర్లో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపుతోంది. తిప్పారపు శ్రీనివాసాచారి(42) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు శ్రీనివాసాచారి సెల్ఫీ వీడియో తీశాడు. ఆస్తిని అన్న ఆంజనేయులు అక్రమంగా తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని శ్రీనివాసాచారి ఆవేదన వ్యక్తం చేశాడు. అక్క లక్ష్మి కూడా మోసం చేసిందని మృతుడు పేర్కొన్నాడు. భగత్ నగర్ ప్రాపర్టీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని సెల్ఫీ వీడియోలో వివరణ ఇచ్చాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.