కరీంనగర్లో దంపతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-03-05T19:54:59+05:30 IST
జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది.
కరీంనగర్: జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. భాగ్యలక్ష్మి, వెంకటేష్ దంపతులు ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబకలహాలే అఘాయిత్యానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.