కరీంనగర్: ఓ మహిళా కానిస్టేబుల్ ఆడియో కలకలం
ABN , First Publish Date - 2022-04-17T16:32:24+05:30 IST
కరీంనగర్: పోలీస్ శాఖలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆడియో కలకలం రేపుతోంది.
కరీంనగర్: పోలీస్ శాఖలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆడియో కలకలం రేపుతోంది. తన కొడుకుతో చనిపోతానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్పోజ్ కేసును పరిష్కరించాలని మహిళా కానిస్టేబుల్ కోరారు. సీఎం కేసీఆర్, డీజీపీకి వినతితో కూడిన ఆడియో రిలీజ్ చేశారు. సిరిసిల్ల నుంచి ఇటీవల జగిత్యాలకు ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. 7th బెటాలియన్ సిరిసిల్లలో ఆమె భర్త ఉద్యోగం చేస్తున్నారు. దీంతో ఆమె స్పోజ్కు దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలు అవుతున్నా... ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో మహిళా కానిస్టేబుల్ కన్నీరుమున్నీరుగా విలపించారు.