కోవిడ్‌ను తరిమికొట్టేందుకు యాగం చేసిన బీజేపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-06-01T22:23:48+05:30 IST

హొన్నాళి బీజేపీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కుమారస్వామి పొలిటికల్ సెక్రటరీ రేణుకాచార్య హిరెకెల్‌మాతా

కోవిడ్‌ను తరిమికొట్టేందుకు యాగం చేసిన బీజేపీ ఎమ్మెల్యే

దావణగెరె (కర్ణాటక): హొన్నాళి బీజేపీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కుమారస్వామి పొలిటికల్ సెక్రటరీ రేణుకాచార్య హిరెకెల్‌మాతా ఆలయంలో సోమవారం కోవిడ్-19కు వ్యతిరేకంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా నవగ్రహ పూజ చేశారు. ఈ పూజా కార్యక్రమాలకు హాజరైన వారు ముఖానికి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించారు. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు  1,90,535 కేసులు నమోదయ్యాయి. 93,322 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 91,819 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 5,394 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-06-01T22:23:48+05:30 IST