ప్రధానిని కలిసిన కొత్త సీఎం బొమ్మై

ABN , First Publish Date - 2021-07-31T00:48:37+05:30 IST

యడియూరప్ప ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం.. భారతీయ జనతా పార్టీ అధిష్టానం బసవరాజుని కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రకటించింది. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం

ప్రధానిని కలిసిన కొత్త సీఎం బొమ్మై

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని కర్ణాటక తాజా ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కలిశారు. ప్రధాని పిలుపు మేరకు శుక్రవారం ఢిల్లీలోని ప్రధాని నివాసానికి తన మంత్రులతో కలిసి వెళ్లారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీని బసవరాజు కలవడం ఇదే మొదటిసారి. కాగా, కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరగా ప్రధాని సుముఖత వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా నూతన ప్రయాణం ప్రారంభించిన బసవరాజుకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా పూర్తి మద్దతు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.


యడియూరప్ప ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం.. భారతీయ జనతా పార్టీ అధిష్టానం బసవరాజుని కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రకటించింది. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రజలతో చక్కటి మైత్రీసంబంధాలు నెరుపుతూ, ప్రజానుకూల కార్యక్రమాలు చేపట్టిన బీఎస్ యడియూరప్ప బాటలోనే ముందుకు సాగుతామని, ఆయన ఏర్పరచిన మార్గదర్శకాలను అనుగుణంగా ముందుకు వెళ్తామని అన్నారు.

Updated Date - 2021-07-31T00:48:37+05:30 IST