మహిళలపై Karnataka కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-12-17T12:45:53+05:30 IST
కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేఆర్ రమేష్ కుమార్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు...
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో అత్యాచార ఘటనలపై రమేష్ కుమార్ దారుణమైన, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.కర్ణాటక అసెంబ్లీలో రమేష్ కుమార్ మాట్లాడుతూ, ‘‘అత్యాచారం అనివార్యమైనప్పుడు పడుకుని ఆనందించండి’’ అని ఓ సామెత ఉందని వ్యాఖ్యానించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేష్ కుమార్ గతంలో సభకు స్పీకర్గా కూడా వ్యవహరించారు.రైతుల సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీలో సమయం నిరాకరించడంతో సదరు నేత ఈ వ్యాఖ్యలు చేశారు.అందరికీ సమయం కేటాయిస్తే సభను ఎలా నిర్వహిస్తారని స్పీకర్ ప్రశ్నించారు.దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.సభలోని ఇతర నాయకులు అభ్యంతరాలు లేవనెత్తడం కంటే అసహ్యకరమైన వ్యాఖ్యలను విని సభ్యులు నవ్వడం విశేషం.
ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన పార్టీ మహిళా సభ్యులతో సహా పలువురు శాసనసభ్యులు సెషన్లో నిరసన తెలిపి, ఖండించారు.ఇంతలో ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.‘‘ఇలాంటి అసహ్యకరమైన, సిగ్గులేని వ్యాఖ్యలకు ఈ సభ మొత్తం స్త్రీలకు, ఈ దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెలకు క్షమాపణలు చెబుతుంది’’ అని ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి అన్నారు.మహిళా ఓటర్లు ఓట్లు వేసి,పన్నులు కట్టి తమను అసెంబ్లీకి పంపారని, అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంత అవమానకరం అని కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కార్యకర్త బృందా అడిగే మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను కేపీసీసీ అధ్యక్షుడు సస్పెండ్ చేసి, ఎన్నికల్లో అతనికి టిక్కెట్ ఇవ్వకుండా ఉండాలని బృందా కోరారు.