బీజేపీ నాయకులు మహా ముదుర్లు: సిద్దూ

ABN , First Publish Date - 2021-08-03T16:56:41+05:30 IST

బీజేపీ నేతలు ఉత్తము లుగా చెప్పుకుంటారని సంస్కారానికి మారుపేరుగా ప్రచారం చేసు కుంటారని కానీ వారంతటి మహా ముదుర్లు ఎవరూ ఉండరని ప్రతిపక్షనేత సిద్దరామయ్య మండిపడ్డారు. ఉ

బీజేపీ నాయకులు మహా ముదుర్లు: సిద్దూ

బెంగళూరు: బీజేపీ నేతలు ఉత్తము లుగా చెప్పుకుంటారని సంస్కారానికి మారుపేరుగా ప్రచారం చేసు కుంటారని కానీ వారంతటి మహా ముదుర్లు ఎవరూ ఉండరని ప్రతిపక్షనేత సిద్దరామయ్య మండిపడ్డారు. ఉత్తరకన్నడ జిల్లా కార్వారలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేణుకాచార్య ఎటువంటి ప్రచారాలు చేయకుండా కోర్టును ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు. అనైతిక, చట్ట వ్యతిరేక కార్యకాలపాలలో పాల్గొని ఉంటారని అందుకే భయపడ్డారన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నా కేంద్ర మాజీ మంత్రి సదానందగౌడ, రేణుకాచార్యలు మాత్రమే ఎందుకు ఎటువంటి ప్రచారాలు చేయకుండా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. రెండువిడతలలో రాష్ట్ర ప్రజలు తీరని కష్టాలు పడ్డారని సకాలంలో ఆసుపత్రిలో పడకలు, వెంటిలేటర్‌లు, ఆక్సిజన్‌ లేకుండా వేలాది మంది మృతి చెందారన్నారు. మూడోవిడత కొవిడ్‌ ప్రబలకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే కోణంలో పరిశీలించకుండా ముఖ్యమంత్రి బొమ్మై మంత్రివర్గ విస్తరణ అంటూ ఢిల్లీలో తిరుగుతున్నారని మండిపడ్డారు. ఉత్తరకర్ణా టకలో వరదలు, తీరప్రాంత జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకోవడంలో నిర్లక్ష్యం సరికాదన్నారు. జేడీఎస్‌ ప్రస్తుతం జాత్యాతీత పార్టీగా లేదన్నారు. జాత్యాతీత సిద్ధాంతాలు వీడి చాలా కాలమైందన్నారు. మేం జేడీఎస్‌లో ఉన్నప్పటిలా ప్రస్తుతం లేదని తేల్చిచెప్పారు. 

Updated Date - 2021-08-03T16:56:41+05:30 IST