16వ తేదీ వరకూ నైట్ కర్ఫ్యూ... సరిహద్దు జిల్లాల్లో వీకెండ్ ఆంక్షలు
ABN , First Publish Date - 2021-08-07T01:36:41+05:30 IST
కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు కర్ణాటక..
బెంగళూరు: కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది. రాష్ట్రాన్ని కేరళ, మహారాష్ట్ర సరిహద్దులతో కలుపుతున్న జిల్లాల్లో వీకెండ్ కర్ఫ్యూలు విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ ఉంటుందని, ఆగస్టు 16వ తేదీ వరకూ ఇది అమలులో ఉంటుందని బెంగళూరు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరులో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఇప్పటికే సెక్షన్ 144 అమలులో ఉంది. ఈనెల 16 వరకూ ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కోవిడ్ పరిస్థితిపై జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైతే మరిన్ని ఆంక్షలు అమల్లోకి తేవాలని బీబీఎంపీ చీఫ్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, కర్ణాటకలో గురువారంనాడు కొత్తగా 1,785 కరోనా కేసులు నమోదు కాగా, 25 మంది మృత్యువాత పడ్డారు.