భారీగా కర్ణాటక మద్యం పట్టివేత - ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2021-08-02T06:14:38+05:30 IST

మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు.

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత - ముగ్గురి అరెస్టు

చెన్నేకొత్తపల్లి, ఆగస్టు 1: మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన మేరకు... స్థానిక పోలీసులు, సె బ్‌ సిబ్బంది పక్కా సమాచారంతో చెన్నేకొత్తపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ప్ర త్యేక నిఘా ఉంచారు. ఆదివారం వాహనాల తనిఖీలు చేస్తుండగా.. ఓ బొలేరో వాహనం లో రహస్యంగా దాచిన 2626 టెట్రా ప్యాకెట్లు, మరికొన్ని కర్ణాటకమద్యం ప్యాకెట్లను గు ర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.30 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపా రు. అక్రమంగా మద్యం తరలిస్తున్న కర్ణాటక రాష్ట్రం పావగడ తాలుకా కోడిమడుగుకు చెందిన కేబీ ప్రసన్న, రొద్దం మండలానికి చెందిన ఉప్పరహరీశ, ఈడిగ ప్రవీణ్‌ను అరె స్టుచేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మద్యాన్ని పావగడ నుంచి తరలించి అనంత పురం పరిసర ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. భారీగా కర్ణాటక మద్యాన్ని పట్టుకున్న సిబ్బందిని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ రామ్మోహను అభినందించారు.ఈ దాడుల్లో సెబ్‌ ఇనస్పెక్టర్‌ నాగేం ద్రప్రసాద్‌, ఎస్‌ఐ శ్రీధర్‌, పోలీసులు శ్రీనివాసులు, జిలానబాషా, వెంకటేశనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T06:14:38+05:30 IST