కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
ABN , First Publish Date - 2021-05-12T06:40:28+05:30 IST
కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు రామసముద్రం పోలీసులు తెలి పారు.
రామసముద్రం, మే 11: కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు రామసముద్రం పోలీసులు తెలి పారు. మంగళవారం మండలంలోని అనప్పల్లె కొత్తూరు చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ రవికుమార్ వాహనాలు తనిఖీ చేస్తుండగా నడుంపల్లె పంచాయతీ మిట్టపల్లెకు చెందిన గిరి... 132 కర్ణాటక ప్యాకెట్లు తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. మద్యం సహా ద్విచక్రవాహనాన్ని స్వాఽధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.