కసాప అధ్యక్షుడిగా Mahesh joshi బాధ్యతలు
ABN , First Publish Date - 2021-11-27T17:04:01+05:30 IST
కన్నడ సాహిత్య పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేశ్జోషి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం చామరాజపేటలోని కన్నడ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సభకు రాష్ట్ర కన్నడ
బెంగళూరు: కన్నడ సాహిత్య పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేశ్జోషి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం చామరాజపేటలోని కన్నడ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సభకు రాష్ట్ర కన్నడ సంస్కృతిశాఖ మంత్రి సునీల్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ అధ్యక్షుడు మనుబళిగార్, కన్నడ సంస్కృతిశాఖ డైరెక్టర్ రంగప్పతోపాటు పలువురు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహేశ్ జోషి గెలుపొందిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మహేశ్జోషి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భాష, సంస్కృతి, సాహిత్య అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. డిసెంబరు 4న కన్నడ సాహిత్య పరిషత్ తొలి కార్యవర్గ సమావేశం జరగనుందన్నారు. కసాప లోగోను ఇతరత్రా దుర్వినియోగం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కసాప కోసం ప్రత్యేకమైన యాప్ను ఏర్పాటు చేస్తామన్నారు. కసాప సభ్యులసంఖ్య కోటికి పెంచుతామన్నారు. త్వరలోనే అఖిలభారత కన్నడ సాహిత్య సమ్మేళనానికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తామన్నారు.