కర్ణాటకలో ఏమాత్రం తగ్గని కరోనా ఉద్ధృతి.. 2 లక్షలు దాటిన కేసులు

ABN , First Publish Date - 2020-08-14T03:11:55+05:30 IST

కర్ణాటకలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం కొత్తగా 6,706 మంది కరోనా బారినపడ్డారు. దీంతో

కర్ణాటకలో ఏమాత్రం తగ్గని కరోనా ఉద్ధృతి.. 2 లక్షలు దాటిన కేసులు

బెంగళూరు: కర్ణాటకలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం కొత్తగా 6,706 మంది కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి మొత్తం సంఖ్య 2 లక్షల మార్క్‌ను దాటేసింది. ఫలితంగా దేశంలో 2 లక్షల కేసులు దాటిన నాలుగో రాష్ట్రంగా రికార్డులకెక్కింది. జులై 27న రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటగా, ఆ తర్వాత 17 రోజుల్లోనే రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,03,200 కేసులు నమోదయ్యాయి. తాజాగా 103 మంది కరోనాతో కన్నుమూశారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 3,613కు పెరిగింది.   


Updated Date - 2020-08-14T03:11:55+05:30 IST