పీఏసీఎస్ను సందర్శించిన కర్ణాటక బృందం
ABN , First Publish Date - 2021-03-06T05:48:11+05:30 IST
స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన బృందం శుక్రవారం పరిశీలించింది.
గజపతినగరం/ బొండపల్లి, మార్చి 5: స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన బృందం శుక్రవారం పరిశీలించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పాటిల్తో పాటు అధికార బృందం సభ్యులు రాష్ట్రంలోగల పీఏసీఎస్ల ద్వారా రైతులకు అందు తున్న సేవలతో పాటు రుణాలు తదితర అంశాలపై ఇక్కడి అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. రైతులతో నేరుగా మాట్లాడు తూ పంట కాలంలో సహకార సంఘాల ద్వారా చేస్తున్న సహకారంపై అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు అభివృద్ధే ధ్యేయంగా సంఘాలు పని చేయాలని సూచించారు. బొండపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో విజయనగరం డివినల్ డీడీవో కె.రామచంద్రరావు, ఎంపీడీవోలు కె.కిషోర్కుమార్, పి.త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.