5 రాష్ట్రాల ప్రజల ప్రవేశాన్ని నిషేధించిన కర్ణాటక

ABN , First Publish Date - 2020-05-29T02:08:53+05:30 IST

5 రాష్ట్రాల ప్రజల ప్రవేశాన్ని నిషేధించిన కర్ణాటక

5 రాష్ట్రాల ప్రజల ప్రవేశాన్ని నిషేధించిన కర్ణాటక

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి 5 రాష్ట్రాల ప్రజలు రాకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ప్రజలు, వాహనాలను ఆపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


Updated Date - 2020-05-29T02:08:53+05:30 IST