కరోనా భయంతో ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం కోరాడంటే..

ABN , First Publish Date - 2020-03-27T01:29:22+05:30 IST

తాజాగా కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తనకు కరోనా సోకిందని భయపడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కరోనా భయంతో ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం కోరాడంటే..

బెంగళూరు: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4లక్షలపైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. భారత్ లో ఇప్పటికి 680పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ వ్యాపించింది. కరోనా పేరు చెప్తేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తనకు కరోనా సోకిందని భయపడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుటుంబ సభ్యులంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూసైడ్ నోట్ లో కోరాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మరణించిన 56 ఏళ్ల వ్యక్తికి కరోనా లక్షణాలు లేవని తెలుస్తోంది. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-03-27T01:29:22+05:30 IST