నిర్మానుష్యంగా నందిగామ
ABN , First Publish Date - 2021-05-06T05:39:30+05:30 IST
నిర్మానుష్యంగా నందిగామ
నందిగామ రూరల్: కర్ఫ్యూతో బుధవారం ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సేవలు మినహా అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూశారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు హరిప్రసాద్, తాతాచార్యులు సిబ్బందితో వాహనాల్లో మైకుల ద్వారా హెచ్చరించారు. అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య కర్ఫ్యూ నిర్వహించారు.