కర్రిగుట్ట ఎన్కౌంటర్పై లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
ABN , First Publish Date - 2022-01-19T23:33:15+05:30 IST
కర్రిగుట్ట ఎన్ కౌంటర్పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ..
వరంగల్: కర్రిగుట్ట ఎన్ కౌంటర్పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదల అయింది. కర్రిగుట్ట ఎన్కౌంటర్ బూటకమని, నిరసనగా ఈ నెల 22న ములుగు జిల్లా బంద్కు పిలుపునిస్తున్నట్లు లేఖలో తెలిపారు.
‘‘ఈ ఎన్కౌంటర్లో కూడా పోలీసులు పాత కథనే చెప్పారు. ఈ నెల 22న చేపట్టబోయే బంద్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి. ఘటన జరిగిన ప్రాంతానికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. పోలీసులే మీడియా పాత్ర పోషించారు. ఎన్ కౌంటర్ అని ప్రజలను నమ్మించే విధంగా కుట్ర చేశారు.’’ అని లేఖలో పేర్కొన్నారు.