కర్రిగుట్ట ఎన్‌కౌంటర్‌పై లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

ABN , First Publish Date - 2022-01-19T23:33:15+05:30 IST

కర్రిగుట్ట ఎన్ కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ..

కర్రిగుట్ట ఎన్‌కౌంటర్‌పై లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

వరంగల్:  కర్రిగుట్ట ఎన్ కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదల అయింది. కర్రిగుట్ట ఎన్‌కౌంటర్ బూటకమని, నిరసనగా ఈ నెల 22న ములుగు జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు లేఖలో తెలిపారు. 


‘‘ఈ ఎన్‌కౌంటర్‌లో కూడా పోలీసులు పాత కథనే చెప్పారు. ఈ నెల 22న చేపట్టబోయే బంద్‌లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి. ఘటన జరిగిన ప్రాంతానికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. పోలీసులే మీడియా పాత్ర పోషించారు. ఎన్ కౌంటర్ అని ప్రజలను నమ్మించే విధంగా కుట్ర చేశారు.’’ అని లేఖలో పేర్కొన్నారు. 



Updated Date - 2022-01-19T23:33:15+05:30 IST