రాజన్న క్షేత్రంలో కార్తీక రద్దీ
ABN , First Publish Date - 2021-11-27T06:12:22+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం నాడు భక్తులతో రద్దీగా మారింది. కార్తీక శుక్రవారం నాడు శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు.
వేములవాడ, నవంబరు 26 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం నాడు భక్తులతో రద్దీగా మారింది. కార్తీక శుక్రవారం నాడు శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని తమ ఇష్టదైవమైన శ్రీస్వామివారిని దర్శించుకుని తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో కుంకుమపూజల్లో పాల్గొన్నారు. శ్రీస్వామివారి నిత్యకళ్యాణం, సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు.