11న కార్తీక దీపోత్సవం

ABN , First Publish Date - 2020-12-05T03:43:22+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నగరంలో ఈనెల 11న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.

11న కార్తీక దీపోత్సవం
ఎంవీపీలోని ఏఎస్‌రాజా గ్రౌండ్స్‌ను పరిశీలిస్తున్న టీటీడీ అధికారులు

ఏఎస్‌రాజా గ్రౌండ్స్‌ను పరిశీలించిన టీటీడీ అధికారులు

ఎంవీపీ కాలనీ, డిసెంబరు 4: తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నగరంలో ఈనెల 11న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎంవీపీ కాలనీలోని ఏఎస్‌ రాజా గ్రౌండ్స్‌ను టీటీడీ అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డాక్టర్‌ కె.రాజగోపాలన్‌, కల్యాణోత్సవం ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌ ఆర్‌ఎస్‌ గోపాల్‌, టీటీడీ భక్తి చానల్‌ సీఈవో సురేష్‌కుమార్‌, ఎస్‌ఈ జగదీశ్వరరెడ్డి, సూపరింటెండెంట్‌ వెంకటరమణ, రవిశంకర్‌రెడ్డి, సురేష్‌బాబు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రుషికొండలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.


Updated Date - 2020-12-05T03:43:22+05:30 IST