ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన కేశినేని

ABN , First Publish Date - 2021-07-15T23:44:54+05:30 IST

ఏపీ ప్రభుత్వాన్ని ఎంపీ కేశినేని నాని సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాతో అల్లాడుతుంటే పన్నులు వేస్తారా

ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన కేశినేని

విజయవాడ: ఏపీ ప్రభుత్వాన్ని ఎంపీ కేశినేని నాని సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాతో అల్లాడుతుంటే పన్నులు వేస్తారా? అని ప్రశ్నించారు. ఆర్ధిక మాంద్యం పరిస్థితుల్లో పన్నుల భారం వేశారని, వైసీపీ అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతుందని విపక్షాలు ముందే చెప్పాయని గుర్తుచేశారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేస్తే సామాన్యుడు బతికే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. పేద మధ్యతరగతి ప్రజలను రోడ్డుకి లాగుతారా అని ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కును వైసీపీ ప్రభుత్వం నొక్కుతోందని కేశినేని నాని ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-15T23:44:54+05:30 IST