రెండు హత్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు: కాటసాని

ABN , First Publish Date - 2021-06-19T00:36:21+05:30 IST

రెండు హత్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు: కాటసాని

రెండు హత్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు: కాటసాని

కర్నూలు: నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమని, రెండు హత్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రకటించారు. హత్య రాజకీయాలకు తాను తన కుటుంబం వ్యతిరేకమని చెప్పారు. ఈనెల 7న నేను ప్రతాప్‌రెడ్డితో మాట్లాడానని తెలిపారు. ప్రతాప్‌రెడ్డిపై గతంలోనే రౌడీ షీట్ ఉందని చెప్పారు. టీడీపీ నేత లోకేష్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఏ దర్యాప్తు సంస్థతో అయినా విచారణ జరిపించాలని రాంభూపాల్‌రెడ్డి కోరారు.


కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో టీడీపీ నాయకులు వడ్డు ప్రతాప్‌రెడ్డి, వడ్డు నాగేశ్వర్‌రెడ్డి ప్రత్యర్థుల హత్య చేశారు. నడుస్తూ వెళ్తోన్న వడ్డు సోదరుల బృందాన్ని వైసీపీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, రాజారెడ్డి, ఎల్లారెడ్డి, అనుచరులతో కలిసి రెండు కార్లతో బలంగా ఢీ కొట్టారు. ఊహించని ఆ పరిణామం నుంచి తేరుకునేలోపే ప్రత్యర్థులు వేటకొడవళ్లు, గొడ్డళ్లతో విరుచుకుపడ్డారు. కిందపడ్డ వడ్డు నాగేశ్వర్‌రెడ్డి, వడ్డు ప్రతాప్‌రెడ్డిపై కత్తులు, వేటకొడళ్లతో దాడి చేశారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తం 13 మంది మూకుమ్మడిగా దాడి చేసి, హత్యలు చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-06-19T00:36:21+05:30 IST