బీద సవాల్‌కు సిద్ధమా?

ABN , First Publish Date - 2020-08-12T10:52:12+05:30 IST

తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర విసిరిన సవాల్‌కు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సిద్ధమా అని టీడీపీ ..

బీద సవాల్‌కు సిద్ధమా?

ఎమ్మెల్యే ప్రతాప్‌పై కోటంరెడ్డి ఫైర్‌


నెల్లూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర విసిరిన సవాల్‌కు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సిద్ధమా అని టీడీపీ నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు దమ్ము, దైర్యం ఉంటే  అవినీతిపై అఖిల పక్షానికి సిద్ధం కావాలని ఆయన సవాల్‌ విసిరారు. మంగళవారం నెల్లూరులోని ఎన్టీఆర్‌ భవన్‌లో కోటంరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కావలిలో రౌడీయిజం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. 200 ఎకరాల్లో ఎమ్మెల్యే అక్రమ లేఅవుట్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.


రైస్‌ పుల్లింగ్‌ నుంచి గుట్కా మాఫియా దాకా అన్నింటిలో సూత్రధారి కాదా అని  ప్రశ్నించారు. పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారని, ఇళ్ల స్థలాల పేరిట మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, సమయం చెబితే కావలికి వస్తామని, అక్కడే తేల్చుకుందామని చాలెంజ్‌ చేశారు. జిల్లా రాజకీయాలను వైసీపీ ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో నాయకులు ధర్మవరం సుబ్బారావు, ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్‌, జెన్ని రమణయ్య, పిట్టి సత్యనాగేశ్వరరావు, కప్పిర శ్రీనివాసులు, పసుపులేటి మల్లికార్జున, నాగేంద్ర, శశి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-12T10:52:12+05:30 IST