కావలి తహసీల్దార్‌కు సన్మానం

ABN , First Publish Date - 2022-01-28T02:45:58+05:30 IST

ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న కావలి తహసీల్దార్‌ మాధవరెడ్డిని, కొత్తపల్లి తెలుగు యువత నాయకుడు పొన్నగం

కావలి తహసీల్దార్‌కు సన్మానం
తహసీల్దార్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న రవీంద్రనాథ్‌

కావలి రూరల్‌, జనవరి27: ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న కావలి తహసీల్దార్‌ మాధవరెడ్డిని, కొత్తపల్లి తెలుగు యువత నాయకుడు పొన్నగంటి రవీంద్రనాథ్‌ గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో కలసి పుష్పగుచ్ఛం అందచేసి సత్కరించారు. ఈ సందర్బంగా రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ఆయన ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.  అనంతరం శాలువాతో సన్మానించారు.


 పలువురికి సత్కారాలు


గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ బీ. శివారెడ్డి, తహసీల్దార్‌ మాధవరెడ్డి, రూరల్‌ సీఐ ఖాజవలిలను గురువారం పలువురు వైసీపీ నాయకులు కలిసి సత్కరించి, అభినందించారు. అభినందించిన వారిలో మాజీ కౌన్సిలర్‌ వడ్లమూడి వెంకటేశ్వర్లు, నోటి శ్రీనివాసులు రెడ్డి, సురేంద్ర తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-28T02:45:58+05:30 IST