కేసీఆర్ డిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్లో భాగం : రేవంత్
ABN , First Publish Date - 2021-11-24T17:58:49+05:30 IST
తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కల్లాలలో రైతు కన్నీరు పెడుతుంటే..
హైదరాబాద్: తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కల్లాలలో రైతు కన్నీరు పెడుతుంటే.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ సేద తీరుతున్నాడన్నారు. కేసీఆర్ డిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమన్నారు. ఈ తీర్థ యాత్రలతో రైతాంగానికి, తెలంగాణకు అయ్యేది, పొయ్యేది ఏమి లేదన్నారు. వానాకాలం పంట కొనకుండా యాసంగి పంట గురించి ఇప్పుడు పంచాయతీ ఏందని రేవంత్ ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడన్నారు. రైతాంగానికి అండగా నిన్న, నేడు, రేపు కాంగ్రెస్ నిలుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.