కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: ఈటల

ABN , First Publish Date - 2021-07-29T20:59:27+05:30 IST

సీఎం కేసీఆర్‌పై మాజీమంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఓడగొట్టే

కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: ఈటల

హుజురాబాద్: సీఎం కేసీఆర్‌పై మాజీమంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఓడగొట్టే దమ్ములేక కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తారని ధ్వజమెత్తారు. ‘‘నా రాజీనామా తర్వాతనే కేసీఆర్ దళితులకు గౌరవం ఇస్తుండు. దళిత బిడ్డలను ఏసీ బస్సుల్లో ఎస్కార్ట్ పెట్టి ప్రగతిభవన్‌కు తీసుకువెళ్లిండు. అర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించారు. రాజకీయ వ్యవస్థను కేసీఆర్ బోన్‌లో నిలబెట్టాడు’’ అని ఈటల రాజేందర్‌ దుయ్యబట్టారు.


మరోవైపు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాజకీయాలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇక్కడ విజయం సాధించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ పార్టీ తమదేనని చెప్పుకోవడానికి ఇక్కడి గెలుపు ఉపయోగపడుతుందనే భావనతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రత్యేక దృష్టిసారించాయి.  


Updated Date - 2021-07-29T20:59:27+05:30 IST