నా గురించి కేసీఆర్కు తెలుసు.. కానీ చెప్పడు: జానారెడ్డి
ABN , First Publish Date - 2021-03-28T01:19:57+05:30 IST
‘జానారెడ్డి అంటే పోరాటయోధుడు..మండలి వ్యవస్థకు ఆద్యుడు’ అని కాంగ్రెస్ జానారెడ్డి వ్యాఖ్యానించారు. హాలియాలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ నిర్వహించింది.
హైదరాబాద్: ‘జానారెడ్డి అంటే పోరాటయోధుడు..మండలి వ్యవస్థకు ఆద్యుడు’ అని కాంగ్రెస్ జానారెడ్డి వ్యాఖ్యానించారు. హాలియాలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభలో జానారెడ్డి మాట్లాడుతూ తన గురించి కేసీఆర్కు తెలుసని కానీ చెప్పడని పేర్కొన్నారు. డబ్బులకు అమ్ముడుపోయి బానిసలుగా మారొద్దని సూచించారు. డబ్బు వెదజల్లి ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. సాగర్లో కాంగ్రెస్ను గెలిపించి సోనియాకు బహుమతిగా ఇద్దామని జానారెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట, గజ్వేల్ కన్నా తమ దగ్గరే రోడ్లు బాగున్నాయని తెలిపారు. నామినేషన్లు వేసి అందరం ఇంట్లోనే ఉందాం. కేసీఆర్ ప్రగతిభవన్లో.. బీజేపీ నేతలు వాళ్ల భవన్లో కూర్చొండి. నేను గాంధీభవన్లో కూర్చుంటా.. ఎవరు గెలుస్తారో చూద్దాం. వారసులు అంటే నా కొడుకో..బిడ్డో కాదు..ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నా వారసుడే’’ అని జానారెడ్డి తెలిపారు.