మోత్కుపల్లిపై ప్రశంసలు కురిపించిన కేసీఆర్

ABN , First Publish Date - 2021-10-18T21:17:40+05:30 IST

మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి మోత్కుపల్లిని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.

మోత్కుపల్లిపై ప్రశంసలు కురిపించిన కేసీఆర్

హైదరాబాద్: మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి మోత్కుపల్లిని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మోత్కుపల్లిపై ప్రశంసలు కురిపించారు. మోత్కుపల్లికి రాజకీయ అనుభవం ఎంతో ఉందని కొనియాడారు. మోత్కుపల్లి తనతో కలిసి ఎన్నో ఏళ్లు పనిచేశారని గుర్తుచేశారు. అణగారిన వర్గాల గళం వినిపించారని తెలిపారు. గతంలో విద్యుత్ కోసం ఎన్నో కష్టాలు పడ్డామని, విద్యుత్ మంత్రిగా చేసిన మోత్కుపల్లికి ఆ కష్టాలు తెలుసని చెప్పారు. స్వరాష్ట్రమే సమస్యలకు పరిష్కారమని ఉద్యమం ప్రారంభించామని గుర్తుచేశారు. తెలంగాణ గురించి దేశ నేతలందరికీ అర్థమయ్యేలా చెప్పామన్నారు. స్వరాష్ట్రం కోసం ఒక్క మాయావతినే 13 సార్లు కలిశామని తెలిపారు. తెలంగాణ సాధనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. తనను తిట్టినన్ని తిట్లు దేశంలో ఎవరినీ తిట్టలేదని చెప్పారు. తెలంగాణ వచ్చాక విద్యుత్ సమస్యను పరిష్కరించుకున్నామని చెప్పారు. రైతు, చేనేత ఆత్మహత్యలు ఆగిపోయాయని కేసీఆర్ తెలిపారు.

Updated Date - 2021-10-18T21:17:40+05:30 IST