ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉంది: సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2020-11-22T21:09:02+05:30 IST
ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉంది: సీఎం కేసీఆర్
హైదరాబాద్: ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చింని అన్నారు. ఈ నెల 23న కోర్టు విచారణ ఉన్నందున, 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షాణాధికారం ఎవరికీ లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.