కేసీఆర్‌ పాలమూరు ద్రోహి: డీకే అరుణ

ABN , First Publish Date - 2021-08-30T00:04:33+05:30 IST

‘కుర్చీ వేసుకుని మరీ పాలమూరులో ప్రాజెక్టులు పూర్తిచేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఇప్పటివరకు తాను ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టునే పూర్తిచేయలేదు..

కేసీఆర్‌ పాలమూరు ద్రోహి: డీకే అరుణ

వనపర్తి: ‘కుర్చీ వేసుకుని మరీ పాలమూరులో ప్రాజెక్టులు పూర్తిచేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఇప్పటివరకు తాను ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టునే పూర్తిచేయలేదు.. కేసీఆర్‌ పాలమూరు ద్రోహి’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను ప్రగతి భవన్‌లో బందీ చేశారని, అందుకే కేసీఆర్‌ గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉందని భావించిన ప్రజలు.. దుబ్బాకలో, జీహెచ్‌ఎంసీలో బీజేపీని గెలిపించారని తెలిపారు. తెలంగాణ అంటే పింఛన్‌, రైతుబంధుగానే మారాయని, పాలన మొత్తం కంగాళీగా మారిందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో పనులు చేస్తూ రాష్ట్ర నిధులతో చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం టీఆర్‌ఎస్‌కు అలవాటుగా మారిందని అరుణ తప్పుబట్టారు. 


Updated Date - 2021-08-30T00:04:33+05:30 IST