కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారు: ఈటల

ABN , First Publish Date - 2022-01-12T20:47:52+05:30 IST

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారు: ఈటల

సంగారెడ్డి: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుకే ఇతర రాష్ట్రాల నేతలను పిలుచుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు చనిపోతున్నా కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. ఉపాధ్యాయులను పిలిచి భరోసా ఇవ్వాల్సిన సీఎం కేసీఆర్‌.. ఇతర రాష్ట్రాల నేతలతో రాజకీయాలపై దృష్టి పెడుతున్నారని దుయ్యబట్టారు. ఉపాధ్యాయుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించొద్దని ఈటల రాజేందర్ సూచించారు.

Updated Date - 2022-01-12T20:47:52+05:30 IST